కామారెడ్డి జిల్లాలో విషాదం.. పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
🚨 కామారెడ్డి జిల్లాలో విషాదం.. పిల్లర్ గుంతలో జారిపడి రెండేళ్ల చిన్నారి మృతి 📍 జుక్కల్ | జులై 31 | తెలంగాణ స్రవంతి కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో నిర్మాణ పనుల కోసం తవ్విన పిల్లర్ గుంతలో ప్రమాదవశాత్తు జారిపడిన రెండేళ్ల చిన్నారి నీటిలో మునిగి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. 🔹 ఎలా జరిగింది? స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కడమంచి అరవింద్ కుమార్తె నవ్యశ్రీ (2) తన తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించి వెనకాలే వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి సమీపంలో కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంత వద్దకు చేరుకున్న చిన్నారి ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ గుంత పూర్తిగా నీటితో నిండిపోవడంతో చిన్నారి అందులో మునిగిపోయింది. 🔹 కుటుంబ సభ్యుల ఆందోళన కొంతసేపటి వరకు చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై గ్రామ పరిసరాల్లో వెతికారు. అనంతరం పిల్లర్ గుంతలో చిన్నారి ఉన్నట్లు గుర్తించి వెంటనే బయటకు తీసి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి త...