ఆపదలో అండగా నిలిచిన మిత్రబృందం.. చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి బియ్యం, ఆర్థిక సాయం
కష్టకాలంలో స్నేహితుడికి అండగా చిన్ననాటి మిత్రులు 50 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందజేత.. ఆపన్నహస్తం చాటుకున్న స్నేహబృందం తిరుమలాయపాలెం, ఆగస్టు 9 (తెలంగాణ స్రవంతి): చిన్ననాటి నుంచి కలిసి మెలిసి పెరిగిన స్నేహితుడి తండ్రి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి ఆయన చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. ఆపద సమయంలో స్నేహబంధం విలువను చాటుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తమ వంతు సహాయాన్ని అందించారు. కష్టకాలంలో ఆపన్నహస్తం కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 50 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. తండ్రిని కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. నిజమైన స్నేహానికి నిదర్శనం ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. కష్టకాలంలో స్నేహితుడికి అండగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని కష్టసమయంలోనూ కొనసాగిస్తూ బాధిత కుటుంబానికి చేయూత అందించడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. ...