మధిరలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన భట్టి విక్రమార్క
మధిరలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు రూ.10 లక్షల ఆర్థిక చేయూత
మధిర, జూలై 12 (తెలంగాణ స్రవంతి ప్రతినిధి):(వి.వెంకీ)
ఖమ్మం జిల్లా మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన రూ.10 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన ఈ చెక్కులను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు అందజేశారు.
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ
ఈ సందర్భంగా తలుపుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భట్టి విక్రమార్కకు లబ్ధిదారుల కృతజ్ఞతలు
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తున్నాయని పేర్కొన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు యన్నం కోటేశ్వరావు, బాణావత్ వెంకటరమణ నాయక్, బెజ్జం రాజు, ధార నాగార్జున, బొల్లెద్దు విజయకుమారి, డివిజన్ కమిటీ అధ్యక్షులు షేక్ జహంగీర్, సామినేని రామనాథం, నకిరికంటి గోవింద్, కోట డేవిడ్, మోదుగు బాబు, ఎస్.కే. రబ్బాని, షేక్ గౌసుద్దీన్, సజ్జా ప్రసాద్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి
జనంనుంచి జనంలోకి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి