సమిష్టి కృషితోనే విద్యా వికాసం.. డోవూరు తండా ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు
సమిష్టి కృషితోనే విద్యా వికాసం.. డోవూరు తండా
ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు
గురువు చేతిలో బలపం ముక్క కాదు... దేశ భవిష్యత్తు
అక్షరాలతోనే లక్ష్యసాధన.. విద్యార్థుల కలలే గురువుల సంకల్పం
నారాయణఖేడ్, జూలై 14 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని డోవూరు తండా ప్రభుత్వ పాఠశాల సమిష్టి కృషికి చిరునామాగా నిలుస్తోంది. ప్రధానోపాధ్యాయుడు మేగ్య, ఉపాధ్యాయుడు పాండురంగరెడ్డి నాయకత్వంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా పనిచేస్తూ పాఠశాలను ఆదర్శ విద్యాలయంగా తీర్చిదిద్దుతోంది.
"గురువు చేతిలో కనిపించేది బలపం ముక్క మాత్రమే అయినా, ఆయన మలచేది దేశ భవిష్యత్తు" అనే భావనను ఆచరణలో చూపిస్తున్న ఈ పాఠశాలలో విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాదు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, విలువలు, క్రమశిక్షణ, మానవత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల అసలైన బలం ఉపాధ్యాయులే
ప్రభుత్వ పాఠశాలల అసలైన బలం భవనాలు కాదని, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులేనని ఈ పాఠశాల నిరూపిస్తోంది. తల్లిదండ్రుల విశ్వాసం, గ్రామస్థుల సహకారం, ఉపాధ్యాయుల నిబద్ధత కలిసివస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా మారగలవని ఇక్కడి ఫలితాలు చెబుతున్నాయి.
విద్యార్థుల బహుముఖ ప్రతిభకు ప్రాధాన్యం
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు చిత్రలేఖనం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల్లో శిక్షణ అందిస్తూ వారి బహుముఖ ప్రతిభను వెలికితీస్తున్నారు. చదువులోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించేలా తీర్చిదిద్దడమే గురువుల లక్ష్యంగా మారింది.
విద్య అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత మాత్రమే కాదు. జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని నిర్మించడం, సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడమే విద్య యొక్క పరమావధి.
"ప్రతి విద్యార్థి ఒక కల... ఆ కలను నిజం చేయడమే ప్రతి గురువు సంకల్పం. విద్యార్థి చేతిలో పుస్తకం ఉంటే, గురువు హృదయంలో అతని భవిష్యత్తు ఉంటుంది" అనే సందేశాన్ని డోవూరు తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ సేవల ద్వారా సార్థకం చేస్తున్నారు.
సమాజ నిర్మాణానికి నిజమైన శిల్పులు గురువులే. వారి త్యాగం, సేవాభావం, నిబద్ధత, సమిష్టి కృషి వల్లే పాఠశాలలు ఆదర్శ విద్యాలయాలుగా, విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
TS MEDIA TELUGU – జనంనుంచి జనంలోకి
.jpg)

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి