పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు హక్కులు ఏమిటి?

చిత్రం
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి మౌలిక హక్కు. ఈ హక్కుతో పాటు ఓటరికి కొన్ని ముఖ్యమైన రక్షణలు, సౌకర్యాలు కూడా చట్టం కల్పించింది. ఓటు వేసే హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటర్ లిస్ట్‌లో ఉంటే తప్పనిసరిగా ఓటు వేయవచ్చు. గుర్తింపు చూపించి ఓటు వేసే హక్కు ఓటు వేయడానికి ఓటర్ ఐడీ కార్డు లేదా ఎన్నికల కమిషన్ అంగీకరించిన ఇతర గుర్తింపు కార్డు చూపించవచ్చు. బెదిరింపులు లేకుండా ఓటు వేసే హక్కు డబ్బులు చూపించి, బెదిరించి లేదా భయపెట్టి ఓటు వేయమంటే అది నేరం. ఇలాంటి ఘటనలపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. గోప్యంగా ఓటు వేసే హక్కు మీరు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా మీ ఓటు వేయాలి. ఎవరూ మీరు ఎవరికి ఓటు వేశారో అడగలేరు. సహాయం పొందే హక్కు వృద్ధులు, దివ్యాంగులు వంటి వారు అవసరమైతే పోలింగ్ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. అనుమతితో తోడుగా ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లవచ్చు. తప్పులు జరిగితే ఫిర్యాదు చేసే హక్కు పోలింగ్ బూత్‌లో ఓటు వేయనివ్వకపోతే, ఎవరో గందరగోళం చేస్తే లేదా బోగస్ ఓటింగ్ జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి లేదా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమాన హక్కు కులం, మతం, డబ్బు లేదా పార్టీ...

బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్

చిత్రం
  మధిర మున్సిపాలిటీ ఎన్నికల 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్ ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ అభ్యర్థిగా గ్యారంగుల కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మధిరలోని సంబంధిత ఎన్నికల కార్యాలయంలో ఆయన అధికారుల ఎదుట నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 22వ వార్డులో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గ్యారంగుల కుమార్ తెలిపారు. మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది.

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

చిత్రం
  హైకోర్టు బెయిల్ ఆదేశాల అమలులో భిన్నత్వమా? బోనకల్ SI తీరుపై ప్రశ్నలు ఖమ్మం జిల్లా, బోనకల్ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన బెయిల్ ఆదేశాలను ఖమ్మం జిల్లా బోనకల్ పోలీస్ స్టేషన్‌లో భిన్నంగా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్దిష్ట సమయంలో పోలీస్ స్టేషన్‌కు హాజరై విచారణకు సహకరించాలనే షరతు మాత్రమే ఉండగా, ఆ షరతును మించి రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టడం ద్వారా అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల్లో “ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో హాజరు కావాలి” అని మాత్రమే స్పష్టంగా పేర్కొనగా, “ఆ సమయం మొత్తం స్టేషన్‌లోనే ఉండాలి” అనే ఆదేశం ఎక్కడా లేదని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ, బోనకల్ పోలీస్ స్టేషన్‌లో కోర్టు ఆదేశాలను భిన్నంగా అర్థం చేసుకుని అమలు చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ విధానం బెయిల్ షరతుల అమలుగా కాకుండా, పరోక్ష కస్టడీలా మారిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి బెయిల్ పొందిన వ్యక్తులు తమ రోజువారీ జీవనానికి, ఉపాధికి వెళ్లే హక్కు ఉన్నప్పటికీ, గంటల తరబడి స్...

ఈత చెట్ల తొలగింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

చిత్రం
  ఖమ్మం జిల్లాలో గీత కార్మికుల జీవనాధారమైన 50 ఈత చెట్లు పీకివేత ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం | :- ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామంలో గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్ బుధవారం ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం దమ్మాయిగూడెం గ్రామ గౌడ సంఘం సభ్యులు తమ జీవనోపాధి కోసం గ్రామ చెరువు కట్టపై వందల సంఖ్యలో ఈత మొక్కలను నాటినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గ్రామ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాం రాజశేఖర్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి రమేష్ జెసిబి సహాయంతో సుమారు 50 ఈత చెట్లను కక్షపూరితంగా తొలగించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల ఉపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో, ఇలా నాటిన చెట్లను తొలగించడం గీత కార్మికులను ఉపాధి లేకుండా చేయడమే కాకుండా వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఈత చెట్లను తొలగించిన వారిపై ...

ఖమ్మం జిల్లాలో TRP మున్సిపల్ మెనిఫెస్టో విడుదల

చిత్రం
  ఖమ్మం జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గౌరవ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, TRP క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సూచనలతో శుక్రవారం ఖమ్మం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కత్తెర గుర్తుపై పోటీ చేయదలచిన ఆశావహ అభ్యర్థులు 9059528984 నంబర్‌ను సంప్రదించాలని పార్టీ నాయకులు తెలిపారు. బీ-ఫారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల వద్ద బిక్షాటన చేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీ సిద్ధంగా ఉందని, పోటీకి ముందుకు రావాలని ఖమ్మం జిల్లా TRP వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీను, వైరా నియోజకవర్గ ఇంచార్జి తేల్లూరి ప్రకాష్, నీట్ట సుదర్శన్, జగదీశ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. — తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా జనంనుంచి జనంలోకి

విద్యార్థుల అల్పాహారానికి రూ.10,000 విరాళం

చిత్రం
  ఎర్రుపాలెం మండలం మీనవోలు ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ యూత్ నాయకుల సేవా కార్యక్రమం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల అల్పాహార అవసరాల కోసం గ్రామ టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రూ.10,000 నగదు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుడుముల మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే ఈ సహాయం అందించామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అఖిల్, కుడుముల వెంకట్ రెడ్డి, నాగుల్ మీరా, సోమశేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, గ్రామ పెద్దలు కొండూరు నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ముందుకు వచ్చిన టీఆర్ఎస్ యూత్...

“గ్రౌండ్ మధ్యలో బిల్డింగ్? సిరిపురంలో వివాదం”

చిత్రం
సిరిపురం గ్రామంలో ఉద్రిక్తత ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో కళాశాల భవన నిర్మాణం అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని గ్రౌండ్‌ మధ్యలో భవనం నిర్మించడంతో స్థానిక విద్యార్థులు, యువకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ మధ్యలో బిల్డింగ్ నిర్మిస్తే గ్రామంలో ఉన్న ఏకైక ఆటస్థలం పూర్తిగా నిరుపయోగంగా మారిపోతుందని విద్యార్థులు, యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తున్నారు. ఆటస్థలం లేకపోవడం వల్ల భవిష్యత్తులో క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, అదే స్థలంలోనే భవనం నిర్మించాలని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు, యువకులు నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులుప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారని, చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు హెచ్చరించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. బిల్డింగ్ నిర్మాణ ప్రదర్శన మార్చినంత మాత్రాన కాంట్రాక్టర్‌కు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జ...

“జేసీబీలతో ఇండ్లు నేలమట్టం: ప్రకాష్ నగర్‌లో కన్నీటిపర్యంతమైన పేదలు”

చిత్రం
 ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్‌లో ఉద్రిక్తత — తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా (TSDM) ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్‌లోని రావిచెట్టు బజార్ ప్రాంతంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఇండ్ల కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అదే ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న పేదల నివాసాలను జేసీబీలతో నేలమట్టం చేశారని బాధితులు తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియాకు తెలిపారు. వందలాది మంది పోలీసులను మోహరించి కూల్చివేతలు చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కూల్చివేతలను ప్రశ్నించిన ప్రజలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి నోటీసు, ముందస్తు హెచ్చరిక లేకుండా ఏకపక్షంగా చేపట్టిన చర్యలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో ఉన్న వస్తువులు తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని, కాస్త కరుణ చూపించాలని వేడుకున్నా పోలీసులు వినిపించుకోలేదని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో పలువురు కట్టుబట్టలతోనే రోడ్డుపాలయ్యారు. రెండు నెలల క్రితం కాలువ విస...

మధిర మున్సిపల్ బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా భిక్కి అనిత ఖరారు

చిత్రం
  మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి చైర్మన్ అభ్యర్థిగా భిక్కి అనిత పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధిర టౌన్ పరిధిలోని 4వ వార్డు చేరుకుమల్లి వారి వీధి, ఇల్లెందుల పాడు ప్రాంతం నుంచి భిక్కి అనిత ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన భిక్కి అనిత భర్త భిక్కి కృష్ణ ప్రసాద్ గతంలో రెండు సార్లు మధిర సహకార సంఘం చైర్మన్‌గా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అలాగే భిక్కి అనిత గతంలో మధిర మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇదే సమయంలో మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్–సీపీఎం మధ్య పొత్తు ఖరారైనట్లు తెలిసింది. ఈ పొత్తులో భాగంగా సీపీఎంకు మూడు వార్డులు కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. — తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా జనం నుంచి… జనంలోకి

BREAKING NEWS | మధిర బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా కపిలవాయి రవీందర్ నియామకం

చిత్రం
 మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మధిర బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కపిలవాయి రవీందర్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కపిలవాయి రవీందర్‌కు ఎన్నికల నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. 2009లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ఆయన, గతంలో హైదరాబాద్ GHMC చంద్రాయణ్‌గుట్ట ఎన్నికల ఇంచార్జ్‌గా, వరంగల్ కార్పొరేషన్ ఇంచార్జ్‌గా, మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా పనిచేశారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎన్నికల ఇంచార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. అదేవిధంగా బీజేపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా, పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడిగా, ఎన్నికల లిటరేచర్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. కపిలవాయి రవీందర్ కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా కూడా సేవలందించడంతో పాటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని, మధిరలో బీజేపీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తా...

జర్నలిజం నుంచి ప్రజాసేవ వైపు – వైరా 5వ వార్డ్‌లో మల్లు మధు లత అడుగు

చిత్రం
వైరా మున్సిపాలిటీ 5వ వార్డ్‌పై ఆసక్తి చూపుతున్న జర్నలిస్ట్ మల్లు మధు లత వైరా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సమస్యలను జర్నలిజం ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చిన జర్నలిస్ట్ మల్లు మధు లత మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. వైరా మున్సిపాలిటీ 5వ వార్డ్‌కు సంబంధించిన ప్రజా సమస్యలను దగ్గర నుంచి గమనిస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో ప్రత్యక్షంగా పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చాలాకాలంగా మీడియా రంగంలో కొనసాగుతున్న మధు లత, స్థానిక సమస్యలు, మహిళా అంశాలు, పట్టణ మౌలిక వసతులపై పలు కథనాలు రాసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిస్టుగా పనిచేసే సమయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనుభవం తనకు ఉందని, అదే అనుభవాన్ని పాలనా వ్యవస్థలో ఉపయోగించుకోవాలన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయంపై ఆలోచిస్తున్నట్లు ఆమె వర్గాలు తెలిపాయి. వైరా మున్సిపాలిటీ 5వ వార్డ్‌లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటూ, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కా...

ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఆవుల సంతోష్ కుమార్ ఎంపిక

చిత్రం
ఖమ్మం జిల్లా మధిర మండల పరిషత్ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆవుల సంతోష్ కుమార్ ఖమ్మం జిల్లా స్థాయిలో ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్ (టీ.ఏ) గా ఎంపికయ్యారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం. ఈ సందర్భంగా గౌరవ డి.ఆర్.డి.ఓ ఆర్. సన్యాసయ్య, ఏ.పి.డి.ఆర్ రామకృష్ణ, ఎం.పి.డి.ఓ బి. వెంకటేశ్వర్లు, ఉపాధి హామీ అధికారులు మరియు సిబ్బంది సంతోష్ కుమార్‌ను అభినందించారు.

మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలు”

చిత్రం
  మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు” మధిర బీఆర్ఎస్ పార్టీ ప్రారంభ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లింగాల కమల్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసే గొప్ప గ్రంథమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, పట్టణ నాయకులు, మధిర మున్సిపాలిటీ పరిధిలోని వార్డు ఇన్‌చార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఖమ్మం ఆసుపత్రిలో మంత్రి కిషన్ , రాఘవ రెడ్డి పరామర్శ"

చిత్రం
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిసాన్ మోర్చా నేత తండ్రిని మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు కూడా పాల్గొని పరామర్శ జిల్లా వైద్య సౌకర్యాలను చూడటంలో మంత్రి, నేతల సంరక్షణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం స్తంబాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తండ్రి, కొండపల్లి రాఘవ రెడ్డిని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంలో మాజీ శాసనసభ్యులు మార్థినేని ధర్మారావు కూడా పాల్గొన్నారు. పరామర్శలో రాఘవ రెడ్డి ఆరోగ్యం గురించి మంత్రి కిషన్ రెడ్డి, మార్తినేని ధర్మారావు పరిస్థితిని తెలుసుకుని, అవసరమైతే సముచిత వైద్య సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు, కార్యకర్తలతో కాసేపు మమేకరించిన మంత్రి మరియు మాజీ శాసనసభ్యులు, వారి కుటుంబానికి మద్దతుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం స్థానిక రాజకీయ, సామాజిక వర్గాలందరికీ ఉత్సాహాన్ని సృష్టించింది.

మధిరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం: రాజకీయ విమర్శలు

 మధిరలో బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో జరిగిన కష్టం, వామపక్ష పార్టీల సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా రూపుదిద్దుకున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్య హక్కు కోసం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను, మున్సిపాలిటీ ఎన్నికల ముందు మధిరలో హడావుడిగా ప్రారంభోత్సవం చేసి ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని ప్రచారం చేస్తున్నా, వాస్తవంగా అక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? అవసరమైన డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది నియామకం జరిగిందా? వైద్య పరికరాలు, మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా? అన్న మధిర ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. కేవలం రిబ్బన్ కట్ చేసి, ఫోటోలు దిగడం ద్వారా ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకమే ఇది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధిరలో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ దక్కించుకోవడం, వామపక్షాల పోరాటాలను పూర్తిగా విస్మరించడం అనైతికమని విమర్శకులు చెప్పారు. ఎన్నికలు దగ్గరపడగానే అభివృద్ధి పేరుతో ప్రారంభోత్సవాల హడా...