🚨 సామినేని రామారావు హత్య కేసులో నిందితుల అరెస్టు ఎప్పుడు?... జూలై 1 సభను జయప్రదం చేయాలని సీపీఎం పిలుపు
🚨 8 నెలలు గడిచినా సామినేని రామారావు హత్య కేసులో పురోగతి లేదు... పోలీసు తీరుపై సీపీఎం తీవ్ర విమర్శలు ఖమ్మం జిల్లా | తెలంగాణ స్రవంతి ప్రతినిధి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జూలై 1న నిర్వహించనున్న కామ్రేడ్ సామినేని రామారావు విగ్రహావిష్కరణ, బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎర్రుపాలెం మండలంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. హత్య కేసుపై సీపీఎం ఆరోపణలు ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ, 2025 అక్టోబర్ 31న చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కామ్రేడ్ సామినేని రామారావును అత్యంత దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిందన్నారు. హత్య జరిగిన అనంతరం ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించినప్పటికీ ఇప్పటికీ హంతకులను అరెస్ట...