రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ ఏసీబీ వలలో… రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్
👉 అక్రమ కల్లు దుకాణానికి అనుమతుల పేరుతో డిమాండ్ 👉 సీఐ ఇంట్లోనే ఏసీబీ ట్రాప్ ఆపరేషన్ విజయవంతం 👉 అదనంగా లెక్కచూపని నగదు స్వాధీనం… విచారణ కొనసాగింపు బిచ్కుంద, ఏప్రిల్ 17 తెలంగాణ స్రవంతి ప్రతినిధి అవినీతి నిరోధక దళం (ACB) మరో కీలక ఆపరేషన్లో కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణను రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అక్రమంగా నడుస్తున్న కల్లు దుకాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు కల్పిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సమాచారం ప్రకారం, బాధితుడి వద్ద నుంచి సీఐ సత్యనారాయణ రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసి ట్రాప్ నిర్వహించారు. శుక్రవారం సీఐ అద్దెకు ఉంటున్న నివాసంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి సోదాల్లో సీఐ వద్ద ఉన్న బ్యాగులో లెక్కచూపని రూ.45,760 నగదును కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ స...