నారాయణఖేడ్లో సంచలనం… మిస్సింగ్ కేసు వెనుక బయటపడిన భర్త హత్య మిస్టరీ
అక్రమ సంబంధం కోసం భర్త హత్య… సంచలనం సృష్టించిన ముత్యంరెడ్డి కేసును ఛేదించిన పోలీసులు
మిస్సింగ్ కేసు దర్యాప్తులో బయటపడిన హత్య ఉదంతం
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ముత్యంరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి మృతుడి భార్య కల్పన, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పండరి, అతని అన్న విఠల్ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 18న ముత్యంరెడ్డి కనిపించడం లేదని అతని భార్య కల్పన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో వెలుగులోకి వచ్చిన హత్య కోణం
పోలీసుల విచారణలో కల్పనకు పండరితో నాలుగేళ్లుగా సంబంధం ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముత్యంరెడ్డి అడ్డుగా మారుతున్నాడనే కారణంతో హత్యకు పథకం రూపొందించినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.
పొలం వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు ఆరోపణ
దర్యాప్తులో భాగంగా ముత్యంరెడ్డిని పొలం వద్దకు తీసుకెళ్లి నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ముందుగానే తవ్విన గుంతలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు.
స్థానికంగా కలకలం
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in
.jpg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి