బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై ఘోర ప్రమాదం… పల్టీలు కొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు, ఐదుగురు మృతి
తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో విషాద ఘటన
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ – బీదర్ రహదారిపై తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది.
ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి
ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
న్యాల్కల్ మండలానికి చెందినవారిగా సమాచారం
మృతుల్లో ఇద్దరు న్యాల్కల్ మండలానికి చెందిన వ్యక్తులుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం
బస్సు రోడ్డుపై పల్టీలు కొట్టడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి