రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… మానూర్లో రైతు వారోత్సవాల ప్రారంభం
🔵 రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… ఎమ్మెల్యే డా. పి. సంజీవ్ రెడ్డి
🟨 మానూర్లో ఘనంగా రైతు వారోత్సవాల ప్రారంభం
🟦 శాస్త్రవేత్తల సూచనలతో ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు
📍 తెలంగాణ స్రవంతి ప్రతినిధి, నారాయణఖేడ్ (సంగారెడ్డి జిల్లా):
సంగారెడ్డి జిల్లా మానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి రైతు వారోత్సవాలను ప్రారంభించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మే 4 నుండి మే 9 వరకు మానూర్ క్లస్టర్ పరిధిలో నిర్వహించనున్న రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణ, యాంత్రీకరణపై అవగాహన కల్పించడం మంచి పరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.సాయిల్ టెస్ట్ ల్యాబ్ మంజూరు
నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాయిల్ టెస్ట్ ల్యాబ్ మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.శాస్త్రవేత్తల సూచనలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, యాంత్రీకరణ వంటి అంశాలపై రైతులకు వివరించారు.పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, మానూర్ క్లస్టర్ పరిధిలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.🔚 తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🌐 https://telanganasravanti.in

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి