ఆప్కారి శాఖ బదిలీలపై రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి
👉 ప్రాధాన్యతా నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు
👉 మెడికల్, స్పౌస్, విడో కేసుల్లో ఇబ్బందులు
👉 పునఃసమీక్ష చేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి
హైదరాబాద్
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
రాష్ట్ర ఆప్కారి శాఖలో ఇటీవల నిర్వహించిన బదిలీలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెడికల్, స్పౌస్, విడో వంటి ప్రాధాన్యతా నిబంధనలు సరైన రీతిలో పరిగణించలేదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల వర్గాల సమాచారం ప్రకారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వస్తున్న పరిస్థితులు, విధవరాలైన మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడవుతోంది. దీంతో సంబంధిత వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇది ఒక్క శాఖకే పరిమితం కాకుండా ఇతర శాఖల ఉద్యోగుల్లో కూడా చర్చకు దారితీస్తున్న అంశంగా మారింది. బదిలీల ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలుపై మరింత స్పష్టత అవసరమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆప్కారి కమిషనర్ స్థాయిలో విషయాన్ని పునఃసమీక్షించి, నిబంధనలకు అనుగుణంగా సవరణలు చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత సమస్యలు పరిష్కారం కాని పక్షంలో చట్టపరమైన మార్గాలను అనుసరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.
అధికారికంగా ఈ ఆరోపణలపై శాఖ నుంచి స్పందన రావాల్సి ఉందని సమాచారం. పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటారని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి