ఉపాధి హామీ కూలీలకు షాక్.. ముఖ హాజరు తప్పనిసరి.. లేదంటే వేతనం నిలిపివేత!
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టడం, నిధుల దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇకపై ఉపాధి హామీ పనులకు హాజరయ్యే ప్రతి కూలీకి ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్) తప్పనిసరి చేయబడింది. మార్చి 2వ తేదీ నుంచి ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధానం అమల్లోకి రానుంది.
గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉండగా మరొకరు పనులకు హాజరయ్యే ఘటనలు, మస్టర్ రోల్స్లో దొంగ సంతకాలు చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ-కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఉపాధి హామీ కూలీకి ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీల ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
🔹 కొత్త విధానం ఎలా ఉంటుంది?
పని ప్రదేశానికి వచ్చిన వెంటనే కూలీ ఫోటో తీసి నమోదు చేస్తారు.
పని ప్రారంభమైన నాలుగు గంటల తర్వాత మరోసారి ఫోటో తీస్తారు.
ఈ రెండు దశలు పూర్తయితేనే హాజరు నమోదు అవుతుంది.
ఏ దశలోనైనా ఫోటో మిస్సైతే వేతనం జమకావడం లేదు.
అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఈ విధాన అమలులో ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఫోటోలు తీసి, తరువాత సిగ్నల్ ఉన్న ప్రాంతంలో యాప్లో అప్లోడ్ చేయాలని ఫీల్డ్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
పారదర్శకత కోసం ఈ విధానం తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు. దీంతో అక్రమాలు తగ్గి, వేతనాలు సకాలంలో కూలీలకు చేరుతాయని వారు పేర్కొన్నారు.
📌 కూలీలకు ముఖ్య సూచన:
పని ప్రదేశంలో రెండు సార్లు ఫోటో తీసే ప్రక్రియ పూర్తయ్యేలా చూసుకోవాలి. లేనిపక్షంలో వేతనం జమకాదు.
✍️
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి