సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో రావులపల్లిలో పరిశుభ్రత–సీజనల్ వ్యాధులపై చైతన్య కార్యక్రమం
రావులపల్లి, తుంగతుర్తి మండలం | 25-02-2026:
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా Telangana Government ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో రావులపల్లి గ్రామంలో పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని Telangana Samskruthika Sarathi సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కళాబృందం వేముల శ్రవణ్ నాయకత్వంలో ఆట–పాట–నాటికల రూపంలో నిర్వహించి ప్రజలను ఆకట్టుకుంది.
కళాబృందం వినిపించిన సందేశాలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి:
“పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం… నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం దగ్గరం!”
“నీ ఇంటి ముందు నీరు నిల్వ ఉండకూడదు… నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి!”
“డెంగ్యూ–మలేరియా నివారణ మన చేతుల్లోనే ఉంది!”
“పరిశుభ్రమైన గ్రామం… సురక్షితమైన భవిష్యత్తు!”
సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సులభమైన భాషలో వివరించారు. తాగునీటిని మరిగించి వాడడం, చెత్తను సమయానికి పారవేయడం, దోమల పెరుగుదల నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృంద సభ్యులు నెమ్మది స్రవంతి, శిరీష, సాయి, వేణు, వెన్నెల నాగరాజు, ప్రియదర్శిని, లక్ష్మి, ప్రియాంక, ఇంద్రజ పాల్గొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమానికి స్పందించారు. మహిళలు, యువత, వృద్ధులు చురుకుగా పాల్గొని “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పించారు.
ప్రభుత్వం చేపడుతున్న ఈ అవగాహన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి