మధిర రైల్వే స్టేషన్ జోన్ మార్పుపై చర్చ – ప్రయాణికుల్లో ఆందోళన
మధిర రైల్వే స్టేషన్ జోన్ మార్పుపై ఆందోళన – ప్రజల ఐక్యతకు పిలుపు
మధిర:
South Central Railway పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కు చెందిన మధిర రైల్వే స్టేషన్ను కొత్తగా ఏర్పాటు చేసిన South Coast Railway (విశాఖపట్నం జోన్) పరిధిలోని విజయవాడ డివిజన్లోకి మార్చే ప్రక్రియ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం మధిర స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉండగా, ప్రతిపాదిత మార్పు ప్రకారం విజయవాడ డివిజన్ పరిధిలోకి చేరే అవకాశముందని సమాచారం. ఈ మార్పు వల్ల భవిష్యత్తులో మధిర స్టేషన్లో ఆగే రైళ్ల సంఖ్యపై ప్రభావం పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులు మధిర స్టేషన్పై ఆధారపడుతున్న నేపథ్యంలో, రైళ్ల ఆపుదల, సౌకర్యాల పరంగా ఎలాంటి మార్పులు వస్తాయో అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానికులు పేర్కొంటున్న వివరాల ప్రకారం, మధిర సెక్షన్లోని కొన్ని కిలోమీటర్ల పరిధి విజయవాడ డివిజన్లోకి వెళ్లే అవకాశముండడంతో, భవిష్యత్తులో రైళ్ల నిలుపుదల నిర్ణయాలు అక్కడి పరిపాలనాధికారుల ఆధీనంలోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు ఈ అంశంపై స్పష్టమైన సమాచారం సేకరించి ప్రజలకు తెలియజేయాలని, అవసరమైతే రైల్వే అధికారులతో చర్చలు జరపాలని స్థానికులు సూచిస్తున్నారు.
మధిర రైల్వే స్టేషన్ ఖమ్మం జిల్లాలో కీలక ప్రయాణ కేంద్రంగా కొనసాగుతున్నందున, ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి