మెగా కంపెనీ లారీ ఢీ… రొంపిమల్లలో కూలిన కరెంటు స్తంభం”
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని రొంపిమల్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం ఉదయం ప్రమాదం తప్పింది. మోహన్ చైతన్య వారి బజార్, వేల్పుల ప్రదీప్ వారి ఇంటి ముందు ఉన్న కరెంటు స్తంభాన్ని మెగా కంపెనీకి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కరెంటు ఉన్న సమయంలోనే స్తంభం విరిగి కింద పడిపోయి, విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై మరియు కాలనీలో చెల్లాచెదురుగా పడిపోయాయి.
అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో కరెంటు సరఫరా కొనసాగుతున్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. అయితే ఒక్కసారిగా స్తంభం కూలిపోవడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తెగిపోయిన తీగలను తొలగించే పనులు చేపట్టారు. అలాగే కూలిపోయిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ వాహనాల రాకపోకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి