99 రోజుల ప్రజా పాలనపై గ్రామాల్లో అవగాహన… కళాబృందంతో వినూత్న ప్రచారం
📍 తెలంగాణ స్రవంతి ప్రతినిధి, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టబడింది. కళాబృందం ద్వారా వినూత్న ప్రచారం తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా టీం లీడర్ వేముల శ్రవణ్ నేతృత్వంలో కళాబృందం గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించింది. ఆట, పాట, మాటల రూపంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రశంసించారు. గ్రామంలో కార్యక్రమం ఈ కార్యక్రమం సోలిపేట గ్రామంలో సోమవారం (04-05-2026) నిర్వహించారు. మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. టీం సభ్యులు ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది కళాకారులు పాల్గొన్నారు. వారు: వెన్నెల నాగరాజు, వేముల శ్రవణ్, ఈర్ల సైదులు, చల్లా లక్ష్మి, మేడిపల్లి వేణు, వంటేపాక ప్రియాంక, మేడి ప్రియదర్శిని, నెమ్మాది స్రవంతి, పోతరాజు శిరీష,...